తెలంగాణ బీజేపీ సెప్టెంబర్ 17వ తేదీన బస్సుయాత్రకు సిద్ధమవుతోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. గతంలో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టారు. ఇప్పుడు అదే తరహా బస్సుయాత్రకు తెలంగాణ బీజేపీ శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్ 17న ప్రారంభం కానున్న ఈ యాత్ర అక్టోబర్ 2న ముగియనుంది. ఉమ్మడి పది జిల్లాలను మూడు క్లస్టర్లుగా విభజించి పాదయాత్ర చేపట్టాలని భావిస్తోంది.