మన దేశంలో డ్రగ్స్, అలసత్వం, అవినీతి వంటి జాడ్యాలు యువతను పట్టి పీడిస్తున్నాయని... వీటిపై పోరాడాలని సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఎందరో మహానుభావులు చేసిన త్యాగాల ఫలితంగానే మన దేశానికి స్వేచ్ఛావాయువులు వచ్చాయని వచ్చాయని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చిన తొలి నాళ్లలో మన దేశంలో ఎంతో మందికి తినేందుకు తిండి గింజలు కూడా లేవని... ఇప్పుడు చంద్రుడిపైకి స్వయంగా కాలుమోపే స్థాయికి ఎదిగామని అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని బసవతారకం ఆసుపత్రిలో జాతీయ జెండాను బాలయ్య ఎగురవేశారు. పేషెంట్లకు, చిన్నారులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.