Friday, March 6, 2026
spot_imgspot_img
HomeHot this Weekతెలుగు రాష్ట్రాల్లో ఆ ఘనత సాధించింది టీడీపీ, బీఆర్ఎస్ పార్టీలే: కేటీఆర్

తెలుగు రాష్ట్రాల్లో ఆ ఘనత సాధించింది టీడీపీ, బీఆర్ఎస్ పార్టీలే: కేటీఆర్

తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ తర్వాత అతి పెద్ద పార్టీ బీఆర్ఎస్ అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నది టీడీపీ, బీఆర్ఎస్ లే అని చెప్పారు. అందుకే బీఆర్ఎస్ సిల్వర్ జుబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 

బీఆర్ఎస్ సిల్వర్ జుబ్లీ వేడుకలు వరంగల్ లో జరగనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

వరంగల్ ఎల్కతుర్తిలో 1,200 ఎకరాల్లో పార్కింగ్ తో పాటు బహిరంగసభకు ఏర్పాట్లు జరుగుతున్నాయని కేటీఆర్ చెప్పారు. 3 వేల బస్సులు ఇవ్వాలని ఆర్టీసీని కోరామని… ఆర్టీసీ సూత్రప్రాయంగా అంగీకరించిందని తెలిపారు. బీఆర్ఎస్ చరిత్రలోనే ఈ సమావేశం అతిపెద్ద సమావేశం అవుతుందని చెప్పారు. 

బహిరంగ సభ తర్వాత కార్యకర్తలు, విద్యార్థుల సభ్యత్వాలను నమోదు చేస్తామని తెలిపారు. సభ్యత్వ నమోదు పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతుందని చెప్పారు. సభ్యత్వ నమోదు తర్వాత పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉంటుందని తెలిపారు.

రాష్ట్ర కమిటీలతో పాటు జిల్లా కమిటీలను వేసుకుంటామని… ఆ తర్వాత జిల్లాల వారీగా కార్యకర్తలకు శిక్షణ సమావేశాలు ఉంటాయని కేటీఆర్ చెప్పారు. 12 నెలల పాటు ప్రతి నెల ఒక్కొక్క కార్యక్రమం నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. బహిరంగసభకు ప్రభుత్వం అనుమతిని ఇవ్వకపోతే కోర్టు ద్వారా అనుమతిని పొందుతామని చెప్పారు.

మాజీ సీఎం కేసీఆర్ ను కేసుల్లో ఇరికించడం గురించే రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. లగచర్లలో రైతులు నిరసన చేశారని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో కూడా విద్యార్థులే ఉద్యమం చేశారని అన్నారు. 

విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. హెచ్ సీయూ భూముల్లో 100 ఎకరాలను చదును చేయడం వల్ల జంతువులు రోడ్ల మీదకు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో డ్రైనేజ్ సమస్యలు, పంట నష్టాలపై అసెంబ్లీలో చర్చ

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ రాజోలు నియోజకవర్గంలో తీవ్రంగా నెలకొన్న డ్రైనేజ్ సమస్యలపై ప్రశ్నించారు. డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల...

Related Articles

మహిళల సమగ్ర అభివృద్ధికి శాఖల మ‌ధ్య సమన్వయం పెర‌గాలి

మహిళల అభివృద్ధి, సాధికారత, సమాన అవకాశాలు, భద్రత అంశాలపై పలు కీలక శాఖలతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు...

ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో డ్రైనేజ్ సమస్యలు, పంట నష్టాలపై అసెంబ్లీలో చర్చ

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ రాజోలు నియోజకవర్గంలో తీవ్రంగా నెలకొన్న డ్రైనేజ్ సమస్యలపై ప్రశ్నించారు....

తెలంగాణకు 2 రాజ్యసభ స్థానాలు – ఎన్నికల తేదీలు ప్రకటించిన ఈసీ

దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది. తెలంగాణలోని రెండు స్థానాలు సహా...

ములుగు మున్సిపాలిటీ నూతన చైర్ పర్సన్ గా ఎన్నికైన చింతనిప్పుల చంద్రకళ బిక్షపతి సన్మాన కార్యక్రమంలో మంత్రి సీతక్క

ములుగు మున్సిపాలిటీ నూతన చైర్‌పర్సన్‌గా ఎన్నికైన చింతనిప్పుల చంద్రకళ బిక్షపతి సన్మాన కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. కాంగ్రెస్...

గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ ల పాత్ర కీలకం : మంత్రి సీతక్క

గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని,గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ ల పాత్ర కీలకంగా ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్,...

మల్కాజ్గిరి డిగ్రీ కళాశాలకు జీఎంసీ క్రీడా సామగ్రి విరాళం చేసిన కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి

ఈ రోజు వాజ్పాయి నగర్, వినాయకనగర్ డివిజన్ పరిధిలోని మల్కాజ్గిరి డిగ్రీ కళాశాలలో జీఎంసీ (GMC) ద్వారా మంజూరైన...

వినాయకనగర్ డివిజన్ అభివృద్ధి పనులకు బడ్జెట్ మంజూరు చేయాలి : క్యానం రాజ్యలక్ష్మి

వినాయకనగర్ డివిజన్‌లో చేపట్టాల్సిన అత్యవసర అభివృద్ధి పనులకు సంబంధించి బడ్జెట్ మంజూరు చేయాలని వినాయకనగర్ డివిజన్ కార్పొరేటర్ క్యానం...

ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజాను పూర్తిగా నియంత్రణలోకి తీసుకొస్తున్నాం : అచ్చెన్నాయుడు

రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా సోడమ్ మండలం అమ్మగారిపల్లి, పుట్టవారిపల్లి గ్రామాల్లో గుర్తించిన ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా (పక్షి ఫ్లూ) కేసులపై...
error: Content is protected !!