Friday, July 17, 2026
Homeట్రేండింగ్తెలుగు రాష్ట్రాల్లో ఆ ఘనత సాధించింది టీడీపీ, బీఆర్ఎస్ పార్టీలే: కేటీఆర్

తెలుగు రాష్ట్రాల్లో ఆ ఘనత సాధించింది టీడీపీ, బీఆర్ఎస్ పార్టీలే: కేటీఆర్

తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ తర్వాత అతి పెద్ద పార్టీ బీఆర్ఎస్ అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నది టీడీపీ, బీఆర్ఎస్ లే అని చెప్పారు. అందుకే బీఆర్ఎస్ సిల్వర్ జుబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 

బీఆర్ఎస్ సిల్వర్ జుబ్లీ వేడుకలు వరంగల్ లో జరగనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

వరంగల్ ఎల్కతుర్తిలో 1,200 ఎకరాల్లో పార్కింగ్ తో పాటు బహిరంగసభకు ఏర్పాట్లు జరుగుతున్నాయని కేటీఆర్ చెప్పారు. 3 వేల బస్సులు ఇవ్వాలని ఆర్టీసీని కోరామని… ఆర్టీసీ సూత్రప్రాయంగా అంగీకరించిందని తెలిపారు. బీఆర్ఎస్ చరిత్రలోనే ఈ సమావేశం అతిపెద్ద సమావేశం అవుతుందని చెప్పారు. 

బహిరంగ సభ తర్వాత కార్యకర్తలు, విద్యార్థుల సభ్యత్వాలను నమోదు చేస్తామని తెలిపారు. సభ్యత్వ నమోదు పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతుందని చెప్పారు. సభ్యత్వ నమోదు తర్వాత పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉంటుందని తెలిపారు.

రాష్ట్ర కమిటీలతో పాటు జిల్లా కమిటీలను వేసుకుంటామని… ఆ తర్వాత జిల్లాల వారీగా కార్యకర్తలకు శిక్షణ సమావేశాలు ఉంటాయని కేటీఆర్ చెప్పారు. 12 నెలల పాటు ప్రతి నెల ఒక్కొక్క కార్యక్రమం నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. బహిరంగసభకు ప్రభుత్వం అనుమతిని ఇవ్వకపోతే కోర్టు ద్వారా అనుమతిని పొందుతామని చెప్పారు.

మాజీ సీఎం కేసీఆర్ ను కేసుల్లో ఇరికించడం గురించే రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. లగచర్లలో రైతులు నిరసన చేశారని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో కూడా విద్యార్థులే ఉద్యమం చేశారని అన్నారు. 

విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. హెచ్ సీయూ భూముల్లో 100 ఎకరాలను చదును చేయడం వల్ల జంతువులు రోడ్ల మీదకు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

Related Articles

పేద, మధ్యతరగతి ప్రజల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు : కిషన్​ రెడ్డి

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తీవ్ర...

బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది.. మంత్రి సీతక్క హామీ

రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర హత్యల ఘటనపై మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె...

తెలంగాణ హక్కుల కోసం ఎవరినైనా ప్రశ్నిస్తా.. ఎంపీ ఈటెల ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ పడబోనని, ప్రజల జీవితాలతో రాజకీయాలు చేసే వారిని నిలదీస్తానని మల్కాజిగిరి...

బీఆర్‌ఎస్ నిధులు, సింగరేణి పరిస్థితిపై కవిత ఘాటు విమర్శలు

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత బీఆర్‌ఎస్ ఆర్థిక వ్యవహారాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్...

పోక్సో కేసులో బండి సాయి భగీరథ్‌కు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు

బండి సాయి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు నుంచి ఊరట లభించింది. పోక్సో చట్టం కింద నమోదైన కేసును విచారించిన...

‘మోటార్లు నడపలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. హరీశ్ రావు సంచలన ప్రకటన

బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసురుతూ సంచలన...

టాప్-5 అగ్ర రాష్ట్రాల్లో తెలంగాణ.. కేసీఆర్ పాలన ఫలితమేనన్న కేటీఆర్

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై జరుగుతున్న రాజకీయ విమర్శల మధ్య, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

వైరల్‌గా మారిన బండ్ల గణేష్​ కుమార్తె జనని వివాహ ఆహ్వాన పత్రిక

సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. కుమార్తె జనని వివాహం వచ్చే నెలలో...
error: Content is protected !!