Friday, June 26, 2026
Homeట్రేండింగ్తెలుగు రాష్ట్రాల్లో ఆ ఘనత సాధించింది టీడీపీ, బీఆర్ఎస్ పార్టీలే: కేటీఆర్

తెలుగు రాష్ట్రాల్లో ఆ ఘనత సాధించింది టీడీపీ, బీఆర్ఎస్ పార్టీలే: కేటీఆర్

తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ తర్వాత అతి పెద్ద పార్టీ బీఆర్ఎస్ అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నది టీడీపీ, బీఆర్ఎస్ లే అని చెప్పారు. అందుకే బీఆర్ఎస్ సిల్వర్ జుబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 

బీఆర్ఎస్ సిల్వర్ జుబ్లీ వేడుకలు వరంగల్ లో జరగనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

వరంగల్ ఎల్కతుర్తిలో 1,200 ఎకరాల్లో పార్కింగ్ తో పాటు బహిరంగసభకు ఏర్పాట్లు జరుగుతున్నాయని కేటీఆర్ చెప్పారు. 3 వేల బస్సులు ఇవ్వాలని ఆర్టీసీని కోరామని… ఆర్టీసీ సూత్రప్రాయంగా అంగీకరించిందని తెలిపారు. బీఆర్ఎస్ చరిత్రలోనే ఈ సమావేశం అతిపెద్ద సమావేశం అవుతుందని చెప్పారు. 

బహిరంగ సభ తర్వాత కార్యకర్తలు, విద్యార్థుల సభ్యత్వాలను నమోదు చేస్తామని తెలిపారు. సభ్యత్వ నమోదు పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతుందని చెప్పారు. సభ్యత్వ నమోదు తర్వాత పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉంటుందని తెలిపారు.

రాష్ట్ర కమిటీలతో పాటు జిల్లా కమిటీలను వేసుకుంటామని… ఆ తర్వాత జిల్లాల వారీగా కార్యకర్తలకు శిక్షణ సమావేశాలు ఉంటాయని కేటీఆర్ చెప్పారు. 12 నెలల పాటు ప్రతి నెల ఒక్కొక్క కార్యక్రమం నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. బహిరంగసభకు ప్రభుత్వం అనుమతిని ఇవ్వకపోతే కోర్టు ద్వారా అనుమతిని పొందుతామని చెప్పారు.

మాజీ సీఎం కేసీఆర్ ను కేసుల్లో ఇరికించడం గురించే రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. లగచర్లలో రైతులు నిరసన చేశారని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో కూడా విద్యార్థులే ఉద్యమం చేశారని అన్నారు. 

విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. హెచ్ సీయూ భూముల్లో 100 ఎకరాలను చదును చేయడం వల్ల జంతువులు రోడ్ల మీదకు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

Related Articles

బీసీల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు వినతి

తెలంగాణ రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల (బీసీ) సంక్షేమం, సామాజిక న్యాయం, హక్కుల పరిరక్షణ కోసం తక్షణ చర్యలు చేపట్టాలని...

యాంటీ ఎమర్జెన్సీ డే సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక సెమినార్

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో "యాంటీ ఎమర్జెన్సీ...

వినాయక్ నగర్‌లో రైల్వే అండర్ బ్రిడ్జి వివాదం.. బాధితులకు అండగా నిలిచిన ఎంపీ

వినాయక్ నగర్ డివిజన్ పరిధిలో ప్రతిపాదిత రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం అభివృద్ధి పనులను స్వాగతిస్తున్నప్పటికీ, ప్రతిపాదిత నిర్మాణం...

అమరావతిని సినీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి లోకేష్

రాష్ట్ర రాజకీయ, పరిపాలనా కేంద్రంగా ఎదుగుతున్న అమరావతి ఈసారి సినీ రంగానికి కూడా వేదికగా మారింది. ప్రముఖ నటుడు,...

ఆర్‌యూబీ సమస్యపై రాజ్యలక్ష్మి చొరవ.. ఎంపీ ఈటల రాజేందర్‌తో బాధితుల భేటీ

వినాయక్ నగర్ డివిజన్ పరిధిలో ప్రతిపాదించిన ఆర్‌యూబీ (రైల్వే అండర్ బ్రిడ్జి) నిర్మాణంపై స్థానిక కాలనీవాసులు ఆందోళన వ్యక్తం...

హెల్త్ కార్డులు, అక్రెడిటేషన్లు వెంటనే ఇవ్వాలి: ప్రభుత్వానికి కేటీఆర్ డిమాండ్

తెలంగాణలో జర్నలిస్టులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గ్రామీణ,...

విజయ్‌కు త్రిష స్పెషల్ బర్త్‌డే విషెస్.. ఒక్క ఫొటోతో పుకార్లకు చెక్

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తన పుట్టినరోజును మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన...

రామ్ చరణ్‌ను ‘న్యూ ఏజ్ మెగాస్టార్’ అన్న ప్రధాని మోదీ.. తండ్రిగా గర్వంగా ఉందన్న చిరంజీవి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రశంసలు మెగాస్టార్ చిరంజీవికి అపారమైన ఆనందాన్ని...
error: Content is protected !!