Saturday, June 6, 2026
Google search engine
HomeHot this Weekతెలుగు రాష్ట్రాల్లో ఆ ఘనత సాధించింది టీడీపీ, బీఆర్ఎస్ పార్టీలే: కేటీఆర్

తెలుగు రాష్ట్రాల్లో ఆ ఘనత సాధించింది టీడీపీ, బీఆర్ఎస్ పార్టీలే: కేటీఆర్

తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ తర్వాత అతి పెద్ద పార్టీ బీఆర్ఎస్ అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నది టీడీపీ, బీఆర్ఎస్ లే అని చెప్పారు. అందుకే బీఆర్ఎస్ సిల్వర్ జుబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 

బీఆర్ఎస్ సిల్వర్ జుబ్లీ వేడుకలు వరంగల్ లో జరగనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

వరంగల్ ఎల్కతుర్తిలో 1,200 ఎకరాల్లో పార్కింగ్ తో పాటు బహిరంగసభకు ఏర్పాట్లు జరుగుతున్నాయని కేటీఆర్ చెప్పారు. 3 వేల బస్సులు ఇవ్వాలని ఆర్టీసీని కోరామని… ఆర్టీసీ సూత్రప్రాయంగా అంగీకరించిందని తెలిపారు. బీఆర్ఎస్ చరిత్రలోనే ఈ సమావేశం అతిపెద్ద సమావేశం అవుతుందని చెప్పారు. 

బహిరంగ సభ తర్వాత కార్యకర్తలు, విద్యార్థుల సభ్యత్వాలను నమోదు చేస్తామని తెలిపారు. సభ్యత్వ నమోదు పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతుందని చెప్పారు. సభ్యత్వ నమోదు తర్వాత పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉంటుందని తెలిపారు.

రాష్ట్ర కమిటీలతో పాటు జిల్లా కమిటీలను వేసుకుంటామని… ఆ తర్వాత జిల్లాల వారీగా కార్యకర్తలకు శిక్షణ సమావేశాలు ఉంటాయని కేటీఆర్ చెప్పారు. 12 నెలల పాటు ప్రతి నెల ఒక్కొక్క కార్యక్రమం నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. బహిరంగసభకు ప్రభుత్వం అనుమతిని ఇవ్వకపోతే కోర్టు ద్వారా అనుమతిని పొందుతామని చెప్పారు.

మాజీ సీఎం కేసీఆర్ ను కేసుల్లో ఇరికించడం గురించే రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. లగచర్లలో రైతులు నిరసన చేశారని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో కూడా విద్యార్థులే ఉద్యమం చేశారని అన్నారు. 

విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. హెచ్ సీయూ భూముల్లో 100 ఎకరాలను చదును చేయడం వల్ల జంతువులు రోడ్ల మీదకు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

పవన్ సభకు భయపడుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్: బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు

తెలంగాణలో జనసేన పార్టీ నిర్వహించాలనుకున్న సభ చుట్టూ నెలకొన్న రాజకీయ వివాదం రోజురోజుకు మరింత వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్​. రామచందర్​...

Related Articles

అనారోగ్యంతో ఉన్న దేవ్‌జీని పరామర్శించిన కల్వకుంట్ల కవిత

అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మావోయిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీని తెలంగాణ రక్షణ...

పవన్ సభకు భయపడుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్: బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు

తెలంగాణలో జనసేన పార్టీ నిర్వహించాలనుకున్న సభ చుట్టూ నెలకొన్న రాజకీయ వివాదం రోజురోజుకు మరింత వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో...

తోత‌పూరి మామిడి రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది : మంత్రి అచ్చెన్నాయుడు

తోత‌పూరి మామిడి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులకు న్యాయమైన ధర లభించేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని...

ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదమా?.. పవన్ వ్యాఖ్యలను తప్పుబట్టిన కేటీఆర్

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక...

ప్రపంచ వేదికపై ఏపీ ప్రకృతి వ్యవసాయానికి అరుదైన గౌరవం.. ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ రైతులు, మహిళలకు అంకితం: మంత్రి అచ్చెన్నాయుడు

ప్రపంచ వేదికపై ఆంధ్రప్రదేశ్ కీర్తి పతాకం రెపరెపలాడుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన...

రూ.62.20 కోట్ల సబ్సిడీతో పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ

రైతు సంక్షేమం, భూసార పరిరక్షణ, సుస్థిర వ్యవసాయాభివృద్ధికి కట్టుబడి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్–2026 సీజన్‌లో పచ్చిరొట్ట పంటల...

ప్రజల సంక్షేమమే బీఆర్ఎస్ లక్ష్యం: కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) రాష్ట్ర ప్రజలకు రాష్ర్ట ఆవిర్భవ దినోత్సవ హృదయపూర్వక...

ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ సర్కార్ ఘోర వైఫల్యం :బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం రోజురోజుకూ వివాదాస్పదంగా మారుతున్న నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ...
error: Content is protected !!