జంగారెడ్డి గూడెం మరణాలపై టీడీపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు మంత్రి కొడాలి నాని. సహజ మరణాలను మద్యం మరణాలుగా దుష్ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ఇలా ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు నాని.