మోదీ ప్రభుత్వం రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా ఈ నేల 16 న భారత్ బంద్ కి పిలుపునిచ్చింది.దీనికి మద్దతుగా హైదరాబాద్ కాంగ్రెస్, వామపక్ష పార్టీలు రాష్ట్రస్థాయి ఆందోళనలు చేపట్టనున్నాయి. ఆయా జిల్లాలోని నియోజకవర్గం మరియు మండల స్థాయి లోని రైతులు, కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చాయి.అటు ఏపీలోనూ బంద్ ను విజయవంతం చేయాలని శ్రేణులకు కాంగ్రెస్ మరియు సిపిఐ పార్టీలు పిలుపునిచ్చాయి.