ఏపీలో రోడ్ల దుస్తితిపై చినజీయర్ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని జంగారెడ్డిగూడెం నుండి రాజమండ్రికి రోడ్డుమార్గంలో ప్రయాణించారు. రాజమండ్రిలో ప్రవచనం చేస్తున్న సమయంలో రోడ్ల గురించి ప్రస్తావించారు. ''ప్రయాణం చేసేటపుడు ఒడిదుడుకులు వుంటాయి… ఒక్కోసారి గోతులు ఎక్కువ వుండొచ్చు… కానీ జంగారెడ్డిగూడెం నుండి ఇక్కడికి రావడానికి… చాలా బావుంది… చక్కగా జ్ఞాపకం వుండేలా వుంది'' అంటూ రోడ్లు అద్వాన్నంగా వున్నాయని చెప్పకుండానే రోడ్ల దుస్థితి గురించి తెలిపారు .