Friday, March 6, 2026
spot_imgspot_img

పంచాయతీరాజ్ సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి సీతక్క

Must read

తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల (బీసీలు)కు మరింత రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 23% రిజర్వేషన్లు ఉన్నప్పటికీ, వారి జనాభా ప్రాతిపదికన తగిన వాటా లభించడం లేదని గుర్తించిన ప్రభుత్వం శాస్త్రీయ సర్వేలు నిర్వహించింది.జి.ఓ.ఎంఎస్ నెం.18 (10-10-2024) ప్రకారం రాష్ట్ర ప్రణాళికశాఖ ఆధ్వర్యంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల ఆధారిత సమగ్ర ఇంటింటి సర్వే జరిగింది. ఆ వివరాలను పరిశీలించిన డెడికేటెడ్ కమిషన్, బీసీలు వెనుకబాటుతనాన్ని దృష్టిలో ఉంచుకుని స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

ఈ క్రమంలో, రిజర్వేషన్ల పెంపుకు అవరోధంగా ఉన్న 2018 పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A ను సవరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. గత చట్టం ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి రిజర్వేషన్లు 50% మించరాదని నిబంధన ఉండేది. ఆ పరిమితిని తొలగిస్తూ, వాస్తవ స్థితిగతులను బట్టి రిజర్వేషన్లు నిర్ణయించేలా కొత్త బిల్లును ప్రభుత్వం సిద్ధం చేసింది.ఆగస్టు 30న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. ఈరోజు (ఆగస్టు 31, 2025) “తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లు – 2025” ను రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టింది.ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి, వెనుకబడిన తరగతులకు న్యాయం చేయాలని సభను కోరింది.

- Advertisement -spot_img

More articles

- Advertisement -

Latest article

error: Content is protected !!