Friday, June 26, 2026

అసెంబ్లీ ఆవరణలో మంత్రి సీతక్క చిట్ చాట్

Must read

తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో మంత్రి సీతక్క వివిధ అంశాలపై చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ చేపట్టడం అంటే బీఆర్‌ఎస్కు భయం ఎందుకు? అని ప్రశ్నించారు. ఆమె అభిప్రాయపడినట్లు, కోర్టులో కాళేశ్వరం సంబంధిత అంశం ఇప్పటివరకు తేలకపోవడం తో బీఆర్‌ఎస్ పార్టీ యూరియా అంశాన్ని తెరపైకి తెచ్చిందని అన్నారు.అలాగే, కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ జరగకుండా ఉండేందుకు బీఆర్‌ఎస్ పార్టీ యూరియా అనే పేరుతో రాజకీయ క్రీడలు ఆడుతున్నదని ఆమె విమర్శించారు. ఆమె మాట్లాడుతూనే, “రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పినట్టు, జాతీయ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టాలని పేర్కొన్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!