Saturday, June 6, 2026
Google search engine

విష్ణుపూరి లో దాదాపు 60 లక్షల రూపాయలతో నాలా పనులు ప్రారంభించిన శ్రవణ్

Must read

విష్ణుపూరి కాలనీలో రూ. 60 లక్షల అదనపు నిధులతో నాలా అభివృద్ధి పనులకు మల్కాజ్గిరి డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్ ఈ రోజు శంకుస్థాపన చేశారు. గతంలో దాదాపు రూ. 1.5 కోట్ల వ్యయంతో చేపట్టిన నాలా పనులకు ఇది కొనసాగింపుగా జరుగుతోంది. తాజా పనులు పూర్తయిన అనంతరం ఆర్.కే.నగర్ సీసీపీఎల్ నుండి సర్దార్ పటేల్ నగర్ వరకు నాలా నిర్మాణం పూర్తవనుంది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “వినాయక చవితికి ముందుగా ఈ పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించాం. కాలనీవాసులు అసౌకర్యం ఎదుర్కొనకుండా ముందస్తు ఏర్పాట్లు జరుగుతాయి,” అని తెలిపారు. అదే విధంగా జి.ఎన్.ఆర్ మేఘన వద్ద ప్యాచ్ వర్క్‌ను తక్షణమే పూర్తిచేయాలని కూడా సూచించారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీఈ మహేష్, ఏఈ నవీన్, రమేష్, నాని, శ్రీనివాస్, వెంకటలక్ష్మి, నందు యాదవ్, ఉజ్వల,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!