Friday, June 26, 2026

పార్టీ సంస్థాగత నిర్మాణంపై గాంధీభవన్‌లో వరంగల్ నేతల సమాలోచన

Must read

గాంధీభవన్‌లో ఆదివారం ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకుల సమావేశం జోరుగా జరిగింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయమైన గాంధీభవన్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి జిల్లా పార్టీ ఇన్‌చార్జి మరియు రాష్ట్ర మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అధ్యక్షత వహించారు.

ఈ సమావేశంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ప్రాదేశిక స్థాయి నాయకులు పాల్గొన్నారు. ప్రధానంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, బలోపేతం, మండల, నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తల చొరవ, సమన్వయం అంశాలపై సమగ్ర చర్చ జరిగింది.

పార్టీని గ్రామ స్థాయిలో బలపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, అందుకు నేతలందరూ సమిష్టిగా పనిచేయాల్సిన అవసరముందని సమావేశంలో స్పష్టం చేశారు. పార్టీ కార్యక్రమాలు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలో, ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడంలో కార్యకర్తల పాత్ర ఎలా ఉండాలనే దానిపై చర్చ సాగింది.

అడ్లూరు లక్ష్మణ్ మాట్లాడుతూ – “ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ కోట అని తిరిగి నిరూపించాలంటే, అన్ని స్థాయిల నేతల సమన్వయం అవసరం. పార్టీకి ఓటమి, గెలుపు కన్నా ముందుగా కార్యకర్తల నిబద్ధత ముఖ్యం,” అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మంత్రులు సీతక్క, కొండా సురేఖలు పార్టీ పటిష్టత కోసం తాము తీసుకుంటున్న చర్యలను వివరించారు. నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం, నియమావళి ప్రకారం నియామకాలు వంటి అంశాలు చర్చకు వచ్చాయి.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!