వైసీపీ వైసీపీ ప్లీనరీలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ టీడీపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం నేతలు నొటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. రోషం గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారంటూ అనిల్ కుమార్ యాదవ్ దుయ్యబట్టారు. తాము సంస్కారంతో ఓపిగ్గా వున్నామని.. కానీ లోకేష్ కమెడియన్‌లా మాట్లాడుతున్నాడని ఆయన మండిపడ్డారు. 2022 ఎన్నికల్లో టీడీపీకి మరోసారి పాడె కడతామని అనిల్ కుమార్ యాదవ్ జోస్యం చెప్పారు.