పంజాబ్: అజాదీక అమృత మహోత్సవం లో భాగంగా షహీద్ సుఖ్ దేవ్ కు లూథియానా , పంజాబ్ లో 31 జూలై 2022 న గురు నానక్ ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ప్రఖ్యాత గజల్ గాయకుడు డా. గజల్ శ్రీనివాస్ ప్రత్యేక గీతం తో నివాళి ఇవ్వనున్నారు 

ముఖ్య అతిధి గా కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి శ్రీమతి మీనాక్షి లేఖి విచ్చేయనున్నారని ,
శ్రీ ఝాన్సీ లక్ష్మీ భాయ్, శ్రీ తాంతియా తోపే, శ్రీ మంగళ్ పాండే, శ్రీ భగత్ సింగ్, శ్రీ ఆష్ఫకుల్లా ఖాన్, శ్రీ రాజగురు, శ్రీ నేతాజీ సుభాష్ చంద్ర బోస్, శ్రీ రాజ్ త్రిపాఠి, శ్రీ లాలా లజపతి రాయ్, శ్రీ గోవింద్ గురు , శ్రీచంద్ర శేఖర్ ఆజాద్, కెప్టెన్ పూల్ సింగ్, శ్రీ ఠాకూర్ దుర్గా సింగ్, శ్రీ వీర్ సావర్కర్ మొదలగు షహీద్ కుటుంబ సభ్యులు గౌరవ అతిధులుగా పాల్గొననున్నారని కార్యక్రమ సంచాలకులు షహీద్ సుఖ్ దేవ్ మనుమడు శ్రీ విశాల్ నయ్యర్ సుఖ్ దేవ్ తెలిపారు.