ఏఎస్ రావు నగర్ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు సింగిరెడ్డి సోమ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రోచ్ఛారణల మధ్య పండితులు పూజలు నిర్వహించగా, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండుగలను సామూహికంగా నిర్వహించడం ఆనందకరమని నేతలు పేర్కొన్నారు. మండపం భక్తి శ్రద్ధలతో నిండిపోగా, భక్తుల రద్దీతో ఉత్సవ వాతావరణం నెలకొంది.
సోమ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంని సందర్శించిన దామోదర్ రాజనర్సింహ




