Saturday, September 5, 2026

కొల్లాపూర్‌లో రూ.15.87 కోట్లతో మూడు హ్యామ్ రోడ్లకు శంకుస్థాపన

Must read

కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో రహదారుల అభివృద్ధికి మరో ముందడుగు పడింది. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలోని నక్కల బండ స్టేజ్ వద్ద రూ.15.87 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న మూడు హ్యామ్ రోడ్డు పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. అనసూయ (సీతక్క), పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.పెద్దకొత్తపల్లి మండలం బండారపాకుల వద్ద పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి జెడ్పీ రోడ్డు వరకు నక్కలపల్లి, వెంకటచెర్ల మీదుగా 6.95 కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించనున్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి రూ.569.90 లక్షల అంచనా వ్యయాన్ని కేటాయించారు. ఈ రహదారి నిర్మాణంతో ఆయా గ్రామాల ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.అదే మండలంలో మరో రహదారి నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. బండపల్లి మీదుగా పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి జమ్మనాపూర్ వరకు 4.40 కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించనున్నారు. ఈ పనులకు రూ.360.80 లక్షల అంచనా వ్యయాన్ని కేటాయించారు. గ్రామీణ ప్రాంతాలను ప్రధాన రహదారులతో అనుసంధానం చేయడంలో ఈ రోడ్డు కీలకంగా మారనుంది.

ఇక వీపనగండ్ల మండలంలో కొర్లకుంట ఎక్స్ రోడ్డు నుంచి తూముకుంట–బొల్లారం ఎక్స్ రోడ్డు వరకు 8 కిలోమీటర్ల మేర మరో రహదారిని నిర్మించనున్నారు. ఈ రహదారి నిర్మాణానికి రూ.656 లక్షల అంచనా వ్యయంతో పనులు చేపట్టనున్నారు. ఈ రోడ్డు పూర్తయితే పరిసర గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడే అవకాశం ఉంది.ఈ మూడు రహదారుల మొత్తం పొడవు 19.35 కిలోమీటర్లు కాగా.. మొత్తం అంచనా వ్యయం రూ.1,586.70 లక్షలు, అంటే సుమారు రూ.15.87 కోట్లు. హ్యామ్ విధానంలో చేపట్టనున్న ఈ రోడ్డు పనులతో నియోజకవర్గంలోని పలు గ్రామాలకు మెరుగైన రహదారి సౌకర్యం అందనుంది.

గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు మెరుగుపడితే ప్రజల రోజువారీ రాకపోకలతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు ప్రయోజనం కలుగుతుందని అధికారులు తెలిపారు. పలు గ్రామాలను అనుసంధానించే ఈ రోడ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రయాణ సమయం కూడా తగ్గే అవకాశం ఉంది.నక్కల బండ స్టేజ్ వద్ద జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, అదనపు కలెక్టర్ దేవ సహాయం, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు పనులను నిర్ణీత ప్రమాణాలతో, నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ పూర్తి చేయాలని అధికారులు సూచించారు.కొల్లాపూర్ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న ఈ రోడ్డు పనులతో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!