Saturday, June 20, 2026

మౌలాలిలో శ్రీ గోదా తాయారు సమేత రంగనాథ స్వామి దేవస్థాన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్

Must read

మౌలాలిలోని కృష్ణానగర్ కాలనీలో ఉన్న శ్రీ గోదా తాయారు సమేత రంగనాథ స్వామి దేవస్థానంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి హాజరైన ఈటల రాజేందర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు వారికి ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!