Saturday, June 6, 2026
Google search engine

స్టార్టప్ ఇండియా మహా ఉద్యమం.. యువత సత్తాకు నిదర్శనం: రామచందర్ రావు

Must read

ప్రధాని నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో ప్రారంభమైన స్టార్టప్ ఇండియా దేశవ్యాప్తంగా మహా ఉద్యమంగా రూపాంతరం చెందిందని తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్. రామచందర్ రావు పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన ఒక సదస్సులో పాల్గొన్న ఆయన, స్టార్టప్ ఇండియా విజయ గాథను వివరించారు.

ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ, దశాబ్దం క్రితం దేశంలో స్టార్టప్‌ల సంఖ్య 500 లోపే ఉండేదని గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం ఆ సంఖ్య 2 లక్షలకు చేరుకుందని తెలిపారు. ఇది భారత యువతలో ఉన్న ప్రతిభ, సృజనాత్మకత, ఆవిష్కరణల సామర్థ్యానికి ప్రతీక అని అన్నారు.ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో భారత్ మూడవ అతిపెద్ద స్థానాన్ని సంపాదించడం ఎంతో గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, పెట్టుబడులు, సౌకర్యాలు స్టార్టప్‌ల వృద్ధికి ముఖ్య కారణమని చెప్పారు. యువతలో ఉన్న ఆవిష్కరణ ఆలోచనలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు.

అలాగే, “స్వయం సమృద్ధ భారత్” లక్ష్య సాధనలో స్టార్టప్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయని రామచందర్ రావు అన్నారు. దేశ ఆర్థికాభివృద్ధిలో యువత భాగస్వామ్యం పెరగడం ద్వారా భారతదేశం ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. యువతలో స్ఫూర్తిని నింపేలా, కొత్త ఆలోచనలను వెలికి తీసేలా ఇలాంటి సదస్సులు నిర్వహించడం చాలా అవసరమని అన్నారు.

భారతదేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, వారు స్టార్టప్‌ల ద్వారా తమ ప్రతిభను నిరూపించుకోవాలని సూచించారు. కొత్త ఆలోచనలతో ముందుకు వస్తే ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తుందని తెలిపారు.

- Advertisement -spot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!