సహకార మరియు మార్కెటింగ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా బత్తుల బ్రహ్మానందరెడ్డి నియామకం. 

సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి తన వాగ్ధాటి పటిమతో ప్రజలలో రాజకీయ,ఆర్థిక,సామాజిక, సాంస్కృతిక విషయాలపై అవగాహన కల్పిస్తున్న వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి ని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 20వ తేదీన సహకార మరియు మార్కెటింగ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సలహాదారునిగా నియమించడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బత్తుల బ్రహ్మానందరెడ్డి సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించడం అభినందనీయం.రాష్ట్రంలో సహకార రంగం మరియు మార్కెటింగ్ రంగాలలో గణనీయమైన అభివృద్ధి సాధించడానికి బత్తుల బ్రహ్మానందరెడ్డి నియామకం
తోడ్పడుతుందని ఆశిద్దాం.