వినాయక నగర్ డివిజన్ పరిధిలోని వివిధ వినాయక మండపాలను కార్పొరేటర్ రాజ్యలక్ష్మి బీజేపీ నాయకులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొని, మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ మాజీ అధ్యక్షుడు ఓం ప్రకాష్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మంగేష్, నాయకులు గోపాల కృష్ణ, గోపాల్, సాయి సురేష్, జగదీష్ చారి, జ్యోతిర్మయి, సుమలత, లక్ష్మి, మల్లేష్ యాదవ్, రమేష్, వెంకటేష్, సోమనాథ్ చారి, పంజా శ్రీనివాస్, శ్రుకేశ్, సాయి రామ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.




