తెలంగాణ బీజేపీ కొత్త రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావును వినాయక్ నగర్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. విదేశీ పర్యటన ముగించుకుని మల్కాజగిరి చేరుకున్న ఆమె, “ఎనిమిది నెలల పాటు విదేశంలో ఉండటంతో రామచందర్రావును కలిసే అవకాశం రాలేదు. ఇప్పుడు కలుసుకుని శుభాకాంక్షలు తెలిపినందుకు సంతోషంగా ఉంది” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.




