Friday, March 6, 2026
spot_imgspot_img

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అపరేష్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం

Must read

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ రాజ్ భవన్‌లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, శాసన సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థాన పదవిలో అపరేష్ కుమార్ సింగ్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా వక్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం రాజభవన్‌లో ఘనంగా నిర్వహించబడింది.

- Advertisement -spot_img

More articles

- Advertisement -

Latest article

error: Content is protected !!