Friday, March 6, 2026
spot_imgspot_img

సమస్యలపై కార్పొరేటర్ శ్రవణ్ పర్యటన

Must read

మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ రాంబ్రహ్మం నగర్, ఓల్డ్ నెరేడ్మెట్ ప్రాంతాల్లో పర్యటించారు. స్థానిక వాసులతో కలిసి నెలకొన్న సమస్యలను తెలుసుకుంటూ ప్రజల నుండి ప్రత్యక్షంగా అభిప్రాయాలు సేకరించారు.

ఈ సందర్భంగా వాసులు డ్రైనేజీ పైప్‌లైన్ లీకేజీ గురించి ఫిర్యాదు చేయగా, కార్పొరేటర్ తక్షణమే స్పందించి రిపేర్ పనులను ప్రారంభించారు. అంతేగాక, రోడ్ల ఊకడం, శానిటేషన్ లోపం, చెట్ల కొమ్మల ట్రిమ్మింగ్ వంటి సమస్యలను కూడా ప్రజలు ప్రస్తావించగా, శ్రవణ్ ఆయా విషయాలను మల్కాజ్గిరి సర్కిల్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సిబ్బందిని పంపించి చర్యలు చేపట్టారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, “కింది స్థాయి సిబ్బంది మరియు అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం జీహెచ్ఎంసీకి శాపంగా మారింది. వీధి దీపాల నిర్వహణలో ఈ లోపం స్పష్టంగా కనిపిస్తోంది,” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంజీవ్, ఆనంద్, నందు యాదవ్, బాబాన్ సింగ్, మురళి గౌడ్, ఆశ, లక్ష్మి, శ్రీనివాస్, పెంటయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేటర్ శ్రవణ్ పర్యటన స్థానికులలో ఆశావహ వాతావరణాన్ని కలిగించింది.

- Advertisement -spot_img

More articles

- Advertisement -

Latest article

error: Content is protected !!