రోహిత్‌పై త్రిగుణ్, కృష్ణుడు ఫైర్..

Must read

బిగ్‌బాస్ తెలుగు హౌస్‌లోకి సామాన్యుడిగా అడుగుపెట్టిన రోహిత్ నాయుడు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాడు. సామాన్యులకు బిగ్‌బాస్‌లో అవకాశం కల్పించేందుకు నిర్వహించిన ‘అగ్నిపరీక్ష 2’లో తన ప్రతిభను చాటుకున్న రోహిత్.. టాస్క్‌లు, ఫిజికల్ పర్ఫార్మెన్స్‌లో నంబర్ వన్ కంటెస్టెంట్‌గా నిలిచాడు. అతడి ఆటతీరుకు ఆకట్టుకున్న జ్యూరీ సభ్యులు రోహిత్‌ను ప్రధాన బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపించారు. దీంతో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే అతడిపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.అయితే హౌస్‌లోకి అడుగుపెట్టిన వెంటనే రోహిత్‌కు అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. సినీ హీరో కృష్ణుడు భాగస్వామిగా సాగిన ‘మ్యాజిక్ కీ’ టాస్క్‌లో రోహిత్ ఓటమి పాలయ్యాడు. దీంతో ఆ టాస్క్ ద్వారా లభించాల్సిన ప్రత్యేక ప్రయోజనాలను అతడు కోల్పోయాడు. అగ్నిపరీక్షలో అద్భుతమైన ఫిజికల్ స్ట్రెంత్ చూపించిన రోహిత్.. బిగ్‌బాస్ హౌస్‌లో మాత్రం తొలి ముఖ్యమైన గేమ్‌లోనే తడబడటం ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉండగా.. రోహిత్ అగ్నిపరీక్షలో సాధించిన విజయమే ఇప్పుడు హౌస్‌లో అతడికి సమస్యగా మారుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లైవ్ షోలో కనిపిస్తున్న పరిణామాలను బట్టి కొందరు సెలబ్రిటీ కంటెస్టెంట్లు రోహిత్‌ను టార్గెట్ చేస్తున్నారనే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ‘చెన్నై లవ్ స్టోరీ’ ఫేమ్ త్రిగుణ్.. రోహిత్‌తో అనవసర వాదనలకు దిగుతున్నాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.మరోవైపు హీరో కృష్ణుడు కూడా రోహిత్‌పై చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. “నీకు లీడర్‌ననే అహంకారం ఎక్కువైంది” అంటూ కృష్ణుడు కామెంట్ చేయడం వివాదాస్పదమైంది. దీంతో సెలబ్రిటీ కంటెస్టెంట్లు కలిసి సామాన్యుడైన రోహిత్‌ను టార్గెట్ చేస్తున్నారా అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ పరిణామాలతో కొంతమంది ప్రేక్షకుల్లో రోహిత్ పట్ల సానుభూతి మరింత పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

అయితే బయట ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణకు భిన్నంగా హౌస్‌లోని టాస్క్‌ల్లో రోహిత్‌కు ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా కనిపించడం లేదు. కంటెస్టెంట్లను రెండు టీమ్‌లుగా విభజించిన గేమ్‌లో రోహిత్ రెడ్ టీమ్‌కు నాయకత్వం వహించగా, జబర్దస్త్ రాంప్రసాద్ బ్లూ టీమ్‌కు లీడర్‌గా వ్యవహరించాడు. ఈ గేమ్‌లో రోహిత్ నాయకత్వంలోని రెడ్ టీమ్ ఓటమి పాలైనట్లు సోషల్ మీడియా లీక్స్ ద్వారా ప్రచారం జరుగుతోంది.అంతేకాకుండా ఆ గేమ్‌లో రెడ్ టీమ్ సభ్యుడు చరణ్ కూడా బయటకు వెళ్లిపోయినట్లు సమాచారం. దీంతో రోహిత్ నాయకత్వ సామర్థ్యంపై కూడా చర్చ మొదలైంది. అగ్నిపరీక్షలో వ్యక్తిగతంగా అదరగొట్టిన రోహిత్.. బిగ్‌బాస్ హౌస్‌లో టీమ్‌ను నడిపించే విషయంలో మాత్రం మరింత మెరుగ్గా ఆడాల్సిన అవసరం ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ఒకవైపు సెలబ్రిటీల విమర్శలు, మరోవైపు టాస్క్‌ల్లో ఎదురవుతున్న ఓటములు రోహిత్‌పై ఒత్తిడిని పెంచుతున్నాయి. అయితే ఈ పరిస్థితులను అతడు ఎలా ఎదుర్కొంటాడనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అగ్నిపరీక్షలో చూపించిన ఫిజికల్ స్ట్రెంత్‌ను మరోసారి ప్రదర్శించి తన విమర్శకులకు సమాధానం చెప్పాలని రోహిత్ అభిమానులు కోరుతున్నారు.అదే సమయంలో సెలబ్రిటీల రెచ్చగొట్టే వ్యాఖ్యలకు భావోద్వేగంగా స్పందించకుండా ప్రశాంతంగా ఉండాలని అభిమానులు సూచిస్తున్నారు. మైండ్ గేమ్‌పై దృష్టి పెట్టడంతో పాటు.. టీమ్‌ను సమర్థవంతంగా నడిపించి రాబోయే టాస్క్‌ల్లో విజయాలు సాధిస్తే రోహిత్ మళ్లీ ఫామ్‌లోకి రావచ్చని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్ ప్రయాణం ఆసక్తికర మలుపు తిరిగింది. అగ్నిపరీక్షలో నంబర్ వన్‌గా నిలిచిన ఈ సామాన్యుడు.. సెలబ్రిటీల మధ్య తన సత్తా ఎలా చాటుకుంటాడో చూడాలి. రాబోయే టాస్క్‌ల్లో రోహిత్ ఆటతీరు ఎలా ఉండబోతుందన్నది అతడి అభిమానులతో పాటు బిగ్‌బాస్ ప్రేక్షకుల్లోనూ ఉత్కంఠ రేపుతోంది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!