సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో ఈ నెల 8 నుంచి 16 వరకు విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని నిర్ణయించారు. 

రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వైద్యారోగ్యశాఖపై ఉన్నతస్థాయి సమీక్షలో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారు. ఒమిక్రాన్ దృష్ట్యా ముందుగానే సంక్రాంతి సెలవులు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నెల 16 తర్వాత ఒమిక్రాన్ పరిస్థితిపై సమీక్షించి మళ్లీ నిర్ణయం తీసుకోనున్నారు.