ప్రగతి భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
వాయిస్ ఓవర్ : జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్ర పటాలకు సీఎం పుష్పాంజలి ఘటించారు. పలువురు ప్రజాప్రతినిధులు, సీఎస్, డీజీపీ, సీఎంవో అధికారులు, తదితర ప్రభుత్వ ఉన్నతాధికారులు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం పెరేడ్ గ్రౌండ్‌లోని అమర జవానుల స్మారక స్థూపం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి అమర జవాన్లకు ఘన నివాళులు అర్పించారు.