దేశంలో ఆదర్శవంతమైన పథకాలు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సిరిసిల్ల జిల్లాలో ముస్తాబాద్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశానికి దిక్సూచి వంటి కార్యక్రమాలు సీఎం చేపట్టారన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందిసున్నామన్నారు. రాష్ట్రంలో నిరంతర విద్యుత్‌ సరఫరా ముఖ్యమంత్రి దూరదృష్టితోనే సాధ్యమయిందన్నారు. కొందరు పనిలేక సీఎం కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.