తెలంగాణాలో అమలు అవుతోన్న కేసీఆర్ నియంత పాలనకు వ్యతిరేకంగానే బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారన్నారు బీజేపీ నాయకురాలు డీకే అరుణ. పాదయాత్రకు వస్తోన్న స్పందనను చూసి ఓర్వలేకే టీఆర్ఎస్ దాడులు చేస్తోందని ఆరోపించారు. దాడుల్లో బీజేపీ కార్యకర్తలకు చెందిన ఐదు కార్లు ధ్వంసం అయ్యాయని అన్నారు. పాదయాత్రను అడ్డుకుంటారని పోలీసులకు సమాచారం ఉన్నప్పటికీ ప్రేక్షకుల్లా నిలుచుండిపోయారని మండిపడ్డారు.