దళితులను అవమానిస్తే సహించేది లేదు.. కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

Must read

తెలంగాణ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్, మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దేశంలో అణచివేత, దోపిడీ పెరిగిన ప్రతిసారీ కాంగ్రెస్ పార్టీ ప్రజల స్వేచ్ఛ, రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నుంచి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ కుట్రలు చేసిందని సీఎం ఆరోపించారు.చివరకు దళిత సమాజాన్ని అవమానించే పరిస్థితులు ఏర్పడటానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన పార్టీ కారణమయ్యారని రేవంత్ రెడ్డి విమర్శించారు. దళితులను అవమానించే వారిని ప్రజలు సామాజికంగా బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఫామ్‌హౌస్ కేంద్రంగా కుట్రలు చేశారంటూ ఆరోపణ

ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్ర అప్పులపై వాస్తవాలు అసెంబ్లీలో బయటకు వస్తాయనే భయంతోనే కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలను సభలో ఆందోళనలకు ఉసిగొల్పారని సీఎం ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే ముందు రోజు రాత్రి ఫామ్‌హౌస్‌లో సమావేశమై సభను ఎలా అడ్డుకోవాలనే దానిపై ప్రణాళిక రూపొందించారని విమర్శించారు.స్పీకర్ స్థానాన్ని, అధికారులను అవమానించేలా బీఆర్ఎస్ నేతలు వ్యవహరించారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సభ గౌరవాన్ని కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే అనుచితంగా ప్రవర్తించడం సరికాదన్నారు.

ఎర్రవల్లి ఘటనపై తీవ్ర ఆగ్రహం

ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వద్ద దళితులు నిరసన తెలిపి వచ్చిన నేలను పసుపు నీళ్లతో శుద్ధి చేశారన్న అంశంపై సీఎం తీవ్రంగా స్పందించారు. ఈ చర్యలు కేసీఆర్ ఆదేశాల మేరకే జరిగాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు.సమాజాన్ని దొరలు, దళితులుగా విభజించే మనస్తత్వం కేసీఆర్‌దని విమర్శించారు. నేలను శుద్ధి చేయడం కాదని, బీఆర్‌ఎస్ నేతల మనస్సుల్లో ఉన్న కుల అహంకారాన్ని, వివక్ష భావనను తొలగించాల్సిన అవసరం ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఘటనలపై సమగ్ర దర్యాప్తు

గత కొన్ని రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలపై ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా ఉందని సీఎం స్పష్టం చేశారు. ఈ ఘటనలకు సంబంధించిన అన్ని అంశాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందుకోసం అధికారి విజయ్ కుమార్‌ను విచారణకు నియమిస్తున్నట్లు సభలో ప్రకటించారు.అసెంబ్లీ పరిసరాల్లో జరిగిన పరిణామాలు, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు, శాంతిభద్రతలకు సంబంధించిన అంశాలు, విధుల్లో ఉన్న పోలీసులపై జరిగినట్లు ఆరోపణలు ఎదురవుతున్న దాడులు తదితర అంశాలపై విచారణ జరుగుతుందని సీఎం తెలిపారు. కుట్రలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా చట్టపరంగా చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

స్పీకర్‌కు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ

అసెంబ్లీ స్పీకర్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించిన వారిని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సభా వ్యవస్థను, స్పీకర్ స్థానాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి సభ్యుడిపైనా ఉందన్నారు.కొంతమందికి కోర్టుల నుంచి బెయిల్ లభించవచ్చని, అయితే ప్రజల దృష్టిలో వారి చర్యలపై తీర్పు కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ గడ్డపై ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను సహించేది లేదని సీఎం తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ ఘర్షణ తీవ్రస్థాయికి చేరిన సమయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరింత చర్చకు దారితీశాయి. ఒకవైపు బీఆర్ఎస్ తమపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తుండగా.. మరోవైపు ప్రభుత్వం సభా గౌరవాన్ని కాపాడేందుకు, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తోంది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!