సీనియర్ నటుడు, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కు కరోనా నిర్ధారణ అయింది. 

అస్వస్థతకు గురికావడంతో అనుమానంతో ఆయన వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా సోకినట్లు తేలింది. ముందు జాగ్రత్తగా హైదరాబాద్ నగరంలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకుంటున్నారు. రాజేంద్రప్రసాద్ కు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని సమాచారం. 1980, 1990లలో తెలుగు చిత్ర పరిశ్రమలో కామెడీ హీరోగా ఒక ఊపు ఊపి.. రెండో ఇన్నింగ్స్ లో బాధ్యతాయుతమైన ప్రత్యేక పాత్రలతో గుర్తింపు పొందిన రాజేంద్ర ప్రసాద్ ఇటీవలే వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా అయ్యారు. ఈయన నటించిన 'సేనాపతి' సినిమా ఇటీవలే ఓటీటీలో రిలీజ్ అయింది.