ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లాక్‌డౌన్ ఉండబోదని స్పష్టం చేశారు. దేశ రాజధానిలో కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి తగిన ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు. 

‘ఢిల్లీ వ్యాప్తంగా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. ఎవరూ ఏం మాట్లాడటం లేదు. పాజిటివిటీ రేటు 25శాతం పెరిగింది. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం’ అని వివరించారు. 

సిటీలో లాక్‌డౌన్ ఉండబోదని అదే సమయంలో పబ్లిక్ ను కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని సూచించారు .