నటి రేణుదేశాయ్, ఆమె కుమారుడు అకీరా కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా రేణుదేశాయ్ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. 

'' ఎక్కువగా ఇంట్లోనే ఉన్నప్పటికీ నాకు, అఖీరాకు ఇటీవల కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మేము ఇద్దరం ఇప్పుడు కోలుకుంటున్నాము. మీ అందరినీ రిక్వెస్ట్‌ చేస్తున్నాను. కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ను సీరియస్‌గా తీసుకోండి.. మాస్కులు ధరించండి.. జాగ్రత్తగా ఉండండి. నేను గత ఏడాదే రెండు డోసుల వ్యాక్సినేషన్‌ వేయించుకున్నాను. అఖీరాకు మాత్రం ఒకటే డోస్‌ అయ్యింది. రెండవ డోస్‌ వ్యాక్సిన్‌ వేయించాల్సిన సమయంలోనే కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది '' అంటూ రేణూ దేశాయ్ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేశారు.