సినీ పరిశ్రమను కరోనా మహమ్మారి వణికిస్తోంది. టాలీవుడ్ లో ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా అందాల భామ కీర్తి సురేశ్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తాను కరోనా బారిన పడ్డానని… కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నాయని చెప్పింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా తాను కరోనా బారిన పడ్డానని తెలిపింది. మహమ్మారి వ్యాపిస్తున్న తీరు ఆందోళనను కలగజేస్తోందని చెప్పింది. ప్రస్తుతం తాను ఐసొలేషన్ లో ఉన్నానని తెలిపింది. తనతో కాంటాక్ట్ లోకి వచ్చిన వారంతా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని సూచించింది.