వెంకటేష్,వరుణ్ తేజ్ కథానాయకులుగా కొంతకాలం క్రితం వచ్చిన 'ఎఫ్ 2' నాన్ స్టాప్ వినోదాన్ని పంచింది. విడుదలైన ప్రతి ప్రాంతంలో భారీ వసూళ్లను రాబట్టింది. దాంతో ఆ సినిమాకి సీక్వెల్ గా 'ఎఫ్ 3' చేయడానికి సెట్స్ పైకి వెళ్లారు. దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. 

ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారుగానీ కుదరలేదు. ఆ తరువాత ఏప్రిల్ 29వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. కానీ ఆ రోజున కూడా ఈ సినిమా థియేటర్లకు రావడం లేదు. ఈ సినిమాను మే 27వ తేదీన వదలనున్నట్టుగా అధికారిక ప్రకటన చేస్తూ తాజాగా ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. 

"పిల్లలు పరీక్షలు ముగించుకోండి .. పెద్దలు సమ్మర్ సందడికై తయారుకండి .. ఫన్ పిక్నిక్ కి డేట్ ఫిక్స్ చేశాము" అంటూ ఈ కొత్త పోస్టర్ ను వదిలారు. భార్యల పోరు పడలేక ఎక్కువ డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకున్న భర్తల కథ ఇది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు.