వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని తారకరామ నగర్ బస్తీవాసులు కార్పొరేటర్ రాజ్యలక్ష్మి నివాసానికి వెళ్లి వాళ్ల బస్తీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను చెప్పడంతో వెంటనే స్పందించిన కార్పొరేటర్ HMWSSB మేనేజర్ నవీన్ తో కలిసి బస్తీకి వెళ్లి అక్కడ పరిస్థితి చూసి వీలైనంత త్వరగా అక్కడ ఉన్న సమస్యను తీరుస్తానని హామీ ఇచ్చారు. దీనితో అక్కడ ఉన్న స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. బస్తీవాసులు గంగాదర్, నరసమ్మ, నాగార్జున,డివిజన్ అధ్యక్షులు ఓం ప్రకాష్, జిల్లా అధికార ప్రతినిధి నవీన్, సాయి, సురేష్, శ్రీకాంత్, మహేష్ , కాలనీ వాసులు పాల్గొన్నారు