వినాయక్ నగర్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి మల్కాజగిరి ఎంపీ ఈటలతో భేటీ అయ్యి, స్థానిక ప్రజల సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల స్పందిస్తూ, 100 శాతం రైల్వే నిధులతో కాకతీయనగర్, వినాయక్ నగర్ అండర్ బ్రిడ్జ్లు ఆమోదం పొందాయని, వాజ్పేయి నగర్ అండర్ బ్రిడ్జ్ కూడా త్వరలో మంజూరు కాబోతుందని తెలిపారు.
అలాగే వినాయక్ నగర్ ఎస్సీ బస్తీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎంపీ ఎల్ఏడీఎస్ నిధులు కేటాయించాలన్న డిమాండ్పై సానుకూల హామీ ఇచ్చారు. అదనంగా, ప్రాంత ప్రజల తాగునీటి అవసరాల దృష్ట్యా మూడు బోర్వెల్స్ ఏర్పాటు కోసం కూడా చర్యలు తీసుకుంటామని ఎంపీ ఈటల వెల్లడించారు.




