spot_img
Saturday, April 26, 2025
spot_img
HomeHot this Weekతెలుగు రాష్ట్రాల్లో ఆ ఘనత సాధించింది టీడీపీ, బీఆర్ఎస్ పార్టీలే: కేటీఆర్

తెలుగు రాష్ట్రాల్లో ఆ ఘనత సాధించింది టీడీపీ, బీఆర్ఎస్ పార్టీలే: కేటీఆర్

తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ తర్వాత అతి పెద్ద పార్టీ బీఆర్ఎస్ అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నది టీడీపీ, బీఆర్ఎస్ లే అని చెప్పారు. అందుకే బీఆర్ఎస్ సిల్వర్ జుబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 

బీఆర్ఎస్ సిల్వర్ జుబ్లీ వేడుకలు వరంగల్ లో జరగనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

వరంగల్ ఎల్కతుర్తిలో 1,200 ఎకరాల్లో పార్కింగ్ తో పాటు బహిరంగసభకు ఏర్పాట్లు జరుగుతున్నాయని కేటీఆర్ చెప్పారు. 3 వేల బస్సులు ఇవ్వాలని ఆర్టీసీని కోరామని… ఆర్టీసీ సూత్రప్రాయంగా అంగీకరించిందని తెలిపారు. బీఆర్ఎస్ చరిత్రలోనే ఈ సమావేశం అతిపెద్ద సమావేశం అవుతుందని చెప్పారు. 

బహిరంగ సభ తర్వాత కార్యకర్తలు, విద్యార్థుల సభ్యత్వాలను నమోదు చేస్తామని తెలిపారు. సభ్యత్వ నమోదు పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతుందని చెప్పారు. సభ్యత్వ నమోదు తర్వాత పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉంటుందని తెలిపారు.

రాష్ట్ర కమిటీలతో పాటు జిల్లా కమిటీలను వేసుకుంటామని… ఆ తర్వాత జిల్లాల వారీగా కార్యకర్తలకు శిక్షణ సమావేశాలు ఉంటాయని కేటీఆర్ చెప్పారు. 12 నెలల పాటు ప్రతి నెల ఒక్కొక్క కార్యక్రమం నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. బహిరంగసభకు ప్రభుత్వం అనుమతిని ఇవ్వకపోతే కోర్టు ద్వారా అనుమతిని పొందుతామని చెప్పారు.

మాజీ సీఎం కేసీఆర్ ను కేసుల్లో ఇరికించడం గురించే రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. లగచర్లలో రైతులు నిరసన చేశారని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో కూడా విద్యార్థులే ఉద్యమం చేశారని అన్నారు. 

విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. హెచ్ సీయూ భూముల్లో 100 ఎకరాలను చదును చేయడం వల్ల జంతువులు రోడ్ల మీదకు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

ములుగు జిల్లా వెంకటాపురంలో భూభారతి అవగాహన సదస్సు

ములుగు జిల్లా వెంకటాపురంలో భూభారతి చట్టంపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన సదస్సు వైభవంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి...

Related Articles

కాంగ్రెస్ పట్ల ఎలా ఉండాలో కేటీఆర్ సర్టిఫికెట్ అవసరం లేదు: కిషన్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ పట్ల ఎలా వ్యవహరించాలనే దానిపై కేటీఆర్ సర్టిఫికెట్ బీజేపీకి అవసరం లేదని కేంద్ర మంత్రి కిషన్...

ములుగు జిల్లా వెంకటాపురంలో భూభారతి అవగాహన సదస్సు

ములుగు జిల్లా వెంకటాపురంలో భూభారతి చట్టంపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన సదస్సు వైభవంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా...

ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎ.ఎమ్.సి ఛైర్మ‌న్ కోగంటి బాబు

కంచిక‌చ‌ర్ల‌ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మ‌న్ గా నియమితులైన కంచిక‌చ‌ర్ల మండ‌ల‌పార్టీ అధ్య‌క్షుడు కోగంటి వెంక‌ట స‌త్య‌నారాయ‌ణ (కోగంటి...

ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)ను మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర హ‌జ్ క‌మిటీ ఛైర్మ‌న్ షేక్ హ‌స‌న్

రాష్ట్ర హ‌జ్ క‌మిటీ ఛైర్మ‌న్ గా నియ‌మితులైన షేక్ హ‌స‌న్ బాషా ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ను...

గ్రామాల్లో ఉద్యోగ‌, స్వ‌యం ఉపాధి రంగాల‌పై అవ‌గాహ‌న తో క్రీడా స్ఫూర్తి పెంచాలి : ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ‌, మైల‌వ‌రం, జ‌గ్గ‌య్య‌పేట‌, తిరువూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల్లో కేశినేని ఫౌండేష‌న్ ద్వారా ద‌త్త‌త తీసుకున్న 40...

ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎ.ఎమ్.సి ఛైర్మ‌న్ న‌ర్రావాసు

విజ‌య‌వాడ‌ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మ‌న్ గా నియమితులైన గొల్ల‌పూడి గ్రామ టిడిపి అధ్య‌క్షుడు న‌ర్రావాసు ఎంపి కేశినేని...

జాబ్ మేళా క్యాలెండ‌ర్-2025 ఆవిష్క‌రించిన ఎంపి కేశినేని, ఎమ్మెల్యే వ‌సంత‌

ఎపి స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ ద్వారా ఎన్టీఆర్ జిల్లాలో నిర్వ‌హించే జాబ్ మేళా ద్వారా నిరుద్యోగ యువ‌తీ యువ‌కుల‌కు...

ఓల్డ్ మల్కాజ్గిరి లో పవర్ బోర్ రిపేర్ చేయించిన మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్

ఓల్డ్ మల్కాజ్గిరిలో పాడైపోయిన పవర్ బోర్‌ను మరమ్మతు చేయించారు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ మరియు బీజేపీ జిల్లా అధికార...
error: Content is protected !!