వేముల రోహిత్ ఆత్మహత్యకు తాను కారణమన్న భట్టి విక్రమార్క వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు సీనియర్ నేత, న్యాయవాది రాంచందర్ రావు . ఆధారాలు లేని, బాధ్యతలేని ఆరోపణలు చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ భట్టికి లీగల్ నోటీసులు పంపారు.“ఒక నాయకుడి జీవితం దెబ్బ తగిలేలా అసత్య ఆరోపణలు చేస్తే, వాటికి ఫలితాలు భరించాల్సిందే” అని రాంచందర్ రావు హెచ్చరించారు.భట్టి విక్రమార్క మూడురోజులలో బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే, రూ.25 కోట్లు పరువు నష్టం దావా వేయనున్నట్లు నోటీసులో స్పష్టం చేశారు.
భట్టి వ్యాఖ్యలపై రాంచందర్ రావు ఘాటుగా స్పందన




