దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యవహార శైలితో రాజ్యాంగానికి పెను ప్రమాదం పొంచి ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. 73 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తిరుపతి సీపీఐ కార్యాలయం లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రపంచంలో నే అతి బలమైన ప్రజాస్వామ్య దేశం నేడు నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. పేదలకు కల్పిస్తున్న రిజర్వేషన్ లు సైతం రాజ్యాంగం ద్వారా వచ్చినవేనని పేర్కొన్నారు. అయినప్పటికీ అట్టడుగు వర్గాల వారికి నేటికీ ప్రభుత్వ ఫలాలు దక్కడం లేదని అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రను తిరగ రాయాలని బిజెపి నేతలు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.