మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లక్ష్మ తండా కు చెందిన బాధిత బాలిక కుటుంబాన్ని రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి మ‌రియుమ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క పరామర్శించారు. జ‌రిగిన సంఘ‌ట‌న‌పై వివ‌రాలు అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని హామి ఇచ్చారు.. రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు.. రాష్ట్రంలో గంజా,మత్తు మాఫియాలను ఉక్కు పాదంతో అణిచి వేస్తున్నామని అన్నారు.. డ్రగ్స్, గంజాయిని వ‌ల్ల వ్యక్తి యొక్క ఆరోగ్యంతో పాటు సమాజానికి సైతం నష్టం చేస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఆగాయి త్యాలు జరగకుండా వాటి మూలలపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. డ్రగ్స్, గంజాయి మాదకద్రవ్యాల వినియోగంపై పోలీసు శాఖ ఉక్కు పాదం మోపుతుందని మంత్రి తెలిపారు. జ‌రిగిన సంఘ‌న‌పై పూర్తి వివ‌రాలు సేక‌రించి దోషుల‌నుల‌ను శిక్షంచే విధంగా అధికారుల‌ను కోరారు. భావిష్యత్తులో ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటాం. బాధిత కుటుంబానికి అండగా ప్ర‌భుత్వం ఉంటుంద‌న్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బలరాం బలరాం,ఎంఎల్ఏ రామచంద్రు నాయక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.