మనిషికి మొదటి గురువు నేలతల్లి అయితే రెండవ గురువు చెట్టు అన్నారు ప్రముఖ సంగీత దర్శకులు యం.యం. కీరవాణి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుందంటూ” మొక్కల ప్రాధాన్యతను వివరించిన కీరవాణి.. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ను సంగీతమయం చేశారు. జూబ్లీహిల్స్ లోని ప్రశాసన్ నగర్ జీహెచ్ఎమ్సీ పార్క్ లో కీరవాణి తన బృందంతో సింగర్స్ అరుణ్ కౌండిన్య,అమల చేబోలు, మోహన బోగరాజు,హైమత్ మొహమ్మద్,గోమతి, రాహుల్ సిప్లిగంజ్ కలిసి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో భాగంగా మొక్కలు నాటారు.