ఉప్పల్ నియోజకవర్గానికి ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నూతన డిప్యూటీ కమిషనర్ రాజు, గురువారం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిను ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా డీసీ రాజుకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి పరస్పర సహకారంతో ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు. స్థానిక సమస్యల పరిష్కారానికి సమిష్టిగా పని చేయాలని, ప్రజల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. కలయికలో ప్రాంతీయ అభివృద్ధి అంశాలపై చర్చలు జరగినట్లు సమాచారం. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డీసీ రాజు




