ములుగు జిల్లాలో పర్యటించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.గోవిందరావుపేట, తాడ్వాయి మండలాలతో పాటు పలు గ్రామాల్లో పనులు పూర్తి అయిన సీసీ రోడ్లు, గ్రామపంచాయతీ భవనాలు, పశువుల పాకలను మంత్రితో ప్రారంభింపజేశారు.అంతేకాకుండా రూ. 2.34 కోట్ల వ్యయంతో చేపట్టబోయే నూతన పనులకు మంత్రి సీతక్క భూమి పూజ నిర్వహించారు. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన – పలు అభివృద్ధి పనుల ప్రారంభం




