సఫిలగూడ మినీ ట్యాంక్బండ్లో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమానికి విచ్చేసే భక్తులు, విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది తలెత్తినా తక్షణ వైద్య సేవలు అందేలా సమగ్ర ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో ఎటువంటి లోపం లేకుండా అధికారులు పనిచేయాలని శ్రవణ్ సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ వెంకటేశ్వర యాదవ్, ఈఈ లక్ష్మణ్, డీఈ మహేష్, AMOH మంజుల తదితరులు పాల్గొన్నారు.
సఫిలగూడ మినీ ట్యాంక్బండ్లో మెడికల్ క్యాంపును పరిశీలించిన మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్




