Friday, March 6, 2026
spot_imgspot_img

ఇది ప్రజాపాలనా? లేక రౌడీ పాలనా? : దాసోజు శ్రవణ్

Must read

కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మైనంపల్లి మరో నయీంలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించిన ఆయన, మల్కాజిగిరిలో బీఆర్ఎస్ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తూ రౌడీయిజానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.

“హైదరాబాద్ నగరంలో రౌడీయిజానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. మల్కాజిగిరి నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలే దీని నిదర్శనం. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న తీరు ఎంతగానో ఆందోళన కలిగిస్తోంది,” అని శ్రవణ్ గాంధీభవన్ లో మీడియాతో అన్నారు.

ఇది ప్రజాపాలనా? లేక రౌడీ పాలనా? అనే ప్రశ్నను సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ సమక్షంలో ఉంచుతున్నట్లు తెలిపారు. మైనంపల్లిలో మార్పు వస్తుందేమోనని బీఆర్ఎస్ కార్యకర్తలు ఎన్నో రోజులు ఆశగా ఎదురు చూశారని, కానీ ఆయన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని విమర్శించారు.

కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆయన కాళ్లు మొక్కిన మైనంపల్లి, ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “బీఆర్ఎస్ పార్టీ ఆయనకు ఎన్నో అవకాశాలు ఇచ్చింది. అయినా విశ్వాసాన్ని నిలబెట్టుకోలేకపోయారు. ఇప్పుడు పార్టీపై కక్ష సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు” అని వ్యాఖ్యానించారు.

చీమలపుట్టలోకి పాము చొరబడినట్టుగా మల్కాజిగిరిలో మైనంపల్లి ప్రవేశించారని, ఆయన రౌడీయిజాన్ని అడ్డుకునేందుకు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని శ్రవణ్ స్పష్టం చేశారు.

- Advertisement -spot_img

More articles

- Advertisement -

Latest article

error: Content is protected !!