ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర సందర్భంగా మాతంగి స్వర్ణలత రంగం తన భవిష్యవాణితో వినయంగా హాజరైన భక్తులకు సందేశం అందించారు. అమ్మవారి ఆరాధనలో భాగంగా ఐదువారాల పాటు జరిగే పూజల సందర్భంగా, మాతంగి భక్తులపై ఆశీస్సులు కల్పించడంతోపాటు కొన్ని కీలక విషయాలు తెలియజేశారు.
“నా బిడ్డలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాను… నా పూజలు పూర్తిగా సక్రమంగా జరిపించాలి” అంటూ స్వర్ణలత పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం అనువుగా జరిగే వేడుకల మధ్య కొన్ని పొరపాట్లు కొనసాగుతున్నాయని, వాటి వల్ల ప్రభావాలు తప్పవని ఆమె హెచ్చరించారు. “వేల రాసులు నేను రప్పించుకుంటున్నాను… కానీ నాకు అవసరమైన రక్తం బలి ఇవ్వడం లేదు. నాకు మాత్రం సరైన పూజలు చేయడం లేదు” అని ఆవేదన వ్యక్తం చేశారు.
భవిష్యత్పై ఆమె చేసిన సూచనలు గమనించదగినవే. రాబోయే రోజుల్లో మహమ్మారి ప్రబలవచ్చునని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అంతేకాక ఈ సంవత్సరం అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగవచ్చని హెచ్చరించారు. అయితే, వర్షాభిసేఖం సమృద్ధిగా కురవచ్చుననీ, పంటలు మంచి దిగుబడితో పండనున్నాయన్న శుభవార్తను కూడా అందించారు.
“నన్ను కొలిచే వారికి నేనే తోడు, నాకు రక్తం చూపించండి లేకపోతే అల్లకల్లోలం తప్పదు” అంటూ మాతంగి స్పష్టం చేశారు. ఐదు వారాల పాటు సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి, అమ్మవారిని సంతోషపెట్టాలని భక్తులకు పిలుపునిచ్చారు.
బోనాల జాతరలో మాతంగి స్వర్ణలత చేసిన ఈ భవిష్యవాణి భక్తుల్లో ఆసక్తిని, ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. భక్తులు అమ్మవారికి తగిన ఘనత ఇచ్చి, సంప్రదాయానుసారంగా వేడుకలు నిర్వహించాలని కోరుకుంటున్నారు.
బయపెడుతున్న భవిష్యవాణి




