DOST: ‘దోస్త్’లకు ప్రత్యేక విడత సీట్ల కేటాయింపు పూర్తి- 39,969 మందికి సీట్లు

Date:

<p style=”text-align: justify;”>తెలంగాణలో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన దోస్త్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్&zwnj;లో భాగంగా ఆగస్టు 17న సీట్లను కేటాయించారు. ఈ విడతలో మొత్తం 39,969 మంది విద్యార్థులు సీట్లు పొందారు. సీట్లు పొందినవారు ఆన్&zwnj;లైన్&zwnj;లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు ఆగస్టు 18 నుంచి 21 వరకు సంబంధిత కళాశాలల్లో సీసీఓటీపీని సమర్పించి తమ సీటును ధ్రువీకరించుకోవాలని అధికారులు సూచించారు. ‘</p>
<p style=”text-align: justify;”>’దోస్త్’ మూడు రౌండ్ల సీట్లకేటాయింపు వివరాలు పరిశీలిస్తే.. మొత్తంగా 1,95,436 మంది విద్యార్థులకు అధికారులు సీట్లను కేటాయించారు. మొదటి విడతలో 73,220, రెండో విడతలో 49,267, మూడో విడతలో 72949 మందికి సీట్లు పొందారు. అయితే వీరిలో మొదటి విడతలో సీటు పొందినవారు.. రెండో విడతకు, రెండో విడతలో సీటు పొందిన వారు మూడో విడత కౌన్సెలింగ్&zwnj;లో ఉత్తమ కాలేజీ, కోర్సు కోసం కౌన్సెలింగ్&zwnj;లో పాల్గొంటూ ఉంటారు. ఈ క్రమంలో మొత్తం ఎన్ని సీట్లు భర్తీ అయినాయి తెలియాలంటే తుది విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ కూడా పూర్తి కావాల్సి ఉంది.</p>
<p style=”text-align: justify;”>రాష్ట్రంలో ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలో 1054 డిగ్రీ కాలేజీలుండగా, వాటిలో 136 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, నాన్&zwnj; దోస్త్&zwnj; కాలేజీలు 63 ఉన్నాయి. మిగిలినవి ప్రైవేట్&zwnj; కాలేజీలు ఉన్నాయి. డిగ్రీలో బీఏ, బీఎస్సీ, బీకాం, బీకాం ఒకేష&zwnj;న&zwnj;ల్, బీకాం హాన&zwnj;ర్స్, బీఎస్&zwnj;డ&zwnj;బ్ల్యూ, బీబీఏ, బీబీఎం, బీసీఏతో పాటు ఇత&zwnj;ర కోర్సులకు సంబంధించి మొత్తం 4,73,214 సీట్లు ప్రతీ ఏటా ఉండేవి. అయితే ప్రతీ ఏడాది 2 లక్షల నుంచి 2.50 లక్షల సీట్లే భర్తీ అవుతున్నాయి. కొన్ని కాలేజీల్లో జీరో అడ్మిషన్లు, మరికొన్ని కాలేజీల్లో 15 శాతం లోపే ప్రవేశాలు జరిగేవి. దీంతో కాలేజీలు కోర్సులను నడపలేకపోతున్న నేపథ్యంలో హేతుబద్ధీకరణ చేపట్టి 86,670 సీట్లను గతేడాదిలోనే ఫ్రీజ్&zwnj; చేశారు.&nbsp;</p>
<p style=”text-align: center;”><strong><em><a title=”దోస్త్’ నోటిఫికేషన్, పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..” href=”https://telugu.abplive.com/education/dost-2023-notification-released-and-registrations-to-begin-from-may-16-92569″ target=”_blank” rel=”noopener”>’దోస్త్’ నోటిఫికేషన్, పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..</a></em></strong></p>
<p style=”text-align: center;”><strong><em><a title=”Website” href=”https://dost.cgg.gov.in/welcome.do” target=”_blank” rel=”nofollow noopener”>Website</a></em></strong></p>
<p style=”text-align: left;”><strong><span style=”text-decoration: underline;”><em>ALSO READ:</em></span></strong></p>
<p style=”text-align: justify;”><strong><span style=”color: #ff00ef;”>’గేట్&zwnj;-2024′ షెడ్యూలు వచ్చేసింది, ఆగస్టు 24 నుంచి దరఖాస్తుల స్వీకరణ, ఈసారి కొత్త పేపరు జోడింపు!</span></strong><br />దేశంలోని ఐఐటీలతోపాటు ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్&zwnj;డీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(GATE-2024) దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 24 నుంచి ప్రారంభంకానుంది. ఈసారి గేట్ నిర్వహణ బాధ్యతను బెంగళూరులోని ఇండియన్ ఇన్&zwnj;స్టిట్యూట్ ఆఫ్ సైన్స్&zwnj;(ఐఐఎస్&zwnj;సీ) చేపట్టింది. ‘గేట్&zwnj;’లో ఇప్పటివరకు మొత్తం 29 ప్రశ్నపత్రాల్లో పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి కొత్తగా డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(డీఏ) ప్రశ్నపత్రాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీంతో గేట్ పరీక్షలో మొత్తం పేపర్ల సంఖ్య 30కి చేరినట్లయింది.&nbsp; గేట్-2024 పరీక్షలను వచ్చే ఏడాది ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఐఐఎస్సీ-బెంగళూరు షెడ్యూలును విడుదల చేసింది. దేశవ్యాప్తంగా దాదాపు 200 నగరాలు, పట్టణాల్లో గేట్-2024 పరీక్ష నిర్వహించనున్నారు. గేట్&zwnj;లో సాధించిన స్కోరును బట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అభ్యర్థులకు ముఖాముఖి నిర్వహించి, ఉద్యోగాలకు ఎంపిక చేస్తాయి.&nbsp;<br /><a title=”పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..” href=”https://telugu.abplive.com/education/gate-2024-schedule-released-registration-likely-starts-from-august-24-exam-from-feb-3-2024-108729″ target=”_blank” rel=”noopener”>పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..</a></p>
<p style=”text-align: justify;”><span style=”color: #ff00ef;”><strong>TS ICET: టీఎస్ ఐసెట్&zwnj;-2023 కౌన్సెలింగ్&zwnj; వాయిదా, కొత్త షెడ్యూలు ఇదే!</strong></span><br />తెలంగాణలో ఆగస్టు 14 నుంచి ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్ ప్రక్రియ వాయిదాపడింది. కొత్తగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్ 6, 7 తేదీల్లో రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 8 నుంచి 12 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. తదనంతరం సెప్టెంబరు 8 నుంచి 13 వరకు వెబ్&zwnj; ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. వెబ్ఆప్షన్లు నమోదుచేసుకున్న అభ్యర్థులకు ఎంసీఏ, ఎంబీఏ తొలివిడత సీట్లను సెప్టెంబర్&zwnj; 17న కేటాయించనున్నారు. సెప్టెంబరు 22 నుంచి తుది విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తాంచనున్నారు.<br /><a title=”కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..” href=”https://telugu.abplive.com/education/ts-icet-2023-web-counselling-schedule-changed-check-new-dates-here-109992″ target=”_blank” rel=”nofollow noopener”>కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..</a></p>
<p style=”text-align: center;”><strong><a title=”మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..” href=”https://telugu.abplive.com/education” target=”_blank” rel=”nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow nofollow noopener”>మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..</a></strong></p>

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

Popular

More like this
Related

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న 373 వ జయంతి వేడుకలు

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న 373 వ జయంతి వేడుకలు తెలంగాణ వీణ...

ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘బేబీ’

ముక్కోణపు ప్రేమ కథతో.. చిన్న సినిమాగా విడుదలై.. సెన్సేషనల్ హిట్ కొట్టింది...

నేడు “అనగనగా ఒక కథ” ట్రైలర్ విడుదల

రంగు రంగుల చిత్రాల హంగుల మధ్యలో మనం మర్చిపోయిన బ్లాక్ అండ్...

సెక్యూరిటీ లేకుండా తిరుగుతున్నతెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి- ఎందుకిలా? అసలేం జరిగింది?

<p>ఎన్నికలు సమీపిస్తున్న టైంలో ఏ విషయమైన రాజకీయంగా కాక రేపుతుంది. ఇప్పుడు...
error: Dont Copy Our Content !! To obtain a license to our content, please contact us!