‘మెగా’ కథపైనే పూరి కసరత్తు!

Date:

పూరి జగన్నాథ్ పడిపోయిన ప్రతిసారి లేచి నిలబడుతూనే ఉన్నాడు. ఆయన పనైపోయిందని అనుకున్నవారికి హిట్ తో సమాధానం చెబుతూనే వస్తున్నాడు. అలాంటి పూరి జగన్నాథ్ ని ‘లైగర్’ సినిమా బాగానే ఇబ్బంది పెట్టింది. అయినా ఆ షాక్ నుంచి కూడా ఆయన త్వరగానే కోలుకున్నాడు. మెగాస్టార్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. 

గతంలో చిరంజీవితో ఆయన ‘ఆటోజాని’ చేయాలనుకున్నాడుగానీ కుదరలేదు. ఆ మధ్య చిరంజీవి ఆ సినిమా గురించి ప్రస్తావిస్తే, అంతకంటే మంచి కథతో వస్తానని పూరి చెప్పాడు. అలాంటి కథ కోసం తాను వెయిట్ చేస్తూ ఉంటానని చిరంజీవి అన్నారు. ఆ తరువాతనే చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లో పూరి జర్నలిస్ట్ పాత్రను చేశాడు. 

చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ ఈ నెల 13వ తేదీన థియేటర్లకు రానుంది. ఆ తరువాత ఆయన చేతిలో ఉన్నది ‘భోళా శంకర్’ మాత్రమే. మరో ప్రాజెక్టును మెగాస్టార్ ఒప్పుకోలేదు. అందుకు కారణం పూరితో చేయాలనీ ఆయన ఫిక్స్ కావడమే అనే టాక్ వినిపిస్తోంది. అందుకు సంబంధించిన కథపైనే పూరి కసరత్తు చేస్తున్నాడని అంటున్నారు. ఈ ఏడాదిలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళుతుందని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

Popular

More like this
Related

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న 373 వ జయంతి వేడుకలు

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న 373 వ జయంతి వేడుకలు తెలంగాణ వీణ...

ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘బేబీ’

ముక్కోణపు ప్రేమ కథతో.. చిన్న సినిమాగా విడుదలై.. సెన్సేషనల్ హిట్ కొట్టింది...

నేడు “అనగనగా ఒక కథ” ట్రైలర్ విడుదల

రంగు రంగుల చిత్రాల హంగుల మధ్యలో మనం మర్చిపోయిన బ్లాక్ అండ్...

సెక్యూరిటీ లేకుండా తిరుగుతున్నతెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి- ఎందుకిలా? అసలేం జరిగింది?

<p>ఎన్నికలు సమీపిస్తున్న టైంలో ఏ విషయమైన రాజకీయంగా కాక రేపుతుంది. ఇప్పుడు...
error: Dont Copy Our Content !! To obtain a license to our content, please contact us!