రానున్న ఎన్నికలలో వైసీపీ , బీజేపీ కలయిక తధ్యమని సీపీఐ నేత నారయణ అభిప్రాయపడ్డారు . ఆయన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై నిప్పులు చెరిగారు . చంద్రబాబు , కేసీఆర్ బయటకు బీజేపీ ని ఓడిద్దామని చెబుతున్నా లోపల మాత్రం బీజేపీ తో స్నేహం కోసం చూస్తున్నారని విమర్శించారు . ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ నాటకాలాడుతున్నారని మండిపడ్డారు . కర్ణాటక ఎన్నికలలో ఓటమితో బీజేపీ కౌంట్ డౌన్ మొదలయ్యిందని , సీబీఐ మోదీకి పెంపుడు కుక్కలా వ్యవహరిస్తోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు . దేశాన్ని రక్షిద్దాం నినాదంతో సెప్టెంబరులో ప్రచారజాతలు నిర్వహించనున్నట్లు నారాయణ తెలిపారు .
కేసీఆర్ , బాబు మద్దతు బీజేపీకే …
Date: