తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ పరిస్థితులపై ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ ఫోకస్ చేశారు. ఈ నేపథ్యం లోనే మంగళవారం (రేపు) మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం పై చర్చించనున్నారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర శాఖల పునర్నిర్మాణం, అందుకోసం తేదీల ఖరారు తదితర అంశాలపై సమావేశంలో చర్చిస్తారు. దళితబంధు అమలు విషయంలో పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన పద్దతి, తీసుకోవాల్సిన చర్యల గురించి, పార్టీ చేయాల్సిన కృషి పై చర్చించనున్నారు. అలాగే.. హుజురాబాద్ ఉప ఎన్నిక పై అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.