రాష్ట్ర మంత్రులుగా చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, డాక్టర్ సీదిరి అప్పలరాజు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లోని దర్బార్ హాలులో ఈ ఇద్దరితో బుధవారం మధ్యాహ్నం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించారు. శాసనమండలి ఛైర్మన్ షరీఫ్, శాసనసభాపతి తమ్మినేని సీతారాం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఉప ముఖ్యమంత్రులు, కొత్త మంత్రుల కుటుంబసభ్యుల సమక్షంలో కార్యక్రమం నిర్వహించారు. వేణుగోపాలకృష్ణకు రహదారులు-భవనాల శాఖ, అప్పలరాజుకు మత్స్య, పశుసంవర్ధక శాఖలను అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
ఏపీ ప్రభుత్వం మంత్రివర్గం విస్తరణ
Subscribe
Login
0 Comments